Hyderabad,telangana, మే 1 -- ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఎండ తీవ్రత ఉండగా. మరోవైపు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం(మే 2) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

విశాఖపట్నం,అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్ష సూచన నేపథ్యంలో.. ప్రజలు చెట్ల క్రింద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రేపు ఉష...