Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీ ఈసెట్ - 2025 అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ గడువు ఏప్రిల్ 26వ తేదీతో ముగియనుంది.

ఏపీ ఈసెట్ - 2025 ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి.. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) అభ్యర్థులకు లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్‌ను అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

ఏపీ ఈసెట్ - 2025కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆలస్య రుసుంతో కొనసాగుతోంది. రూ. 10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 28వ తే...