భారతదేశం, జూలై 21 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ ఇంధన రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen), దాని ఉత్పన్నాల పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ' (Green Hydrogen Valley) చొరవలో భాగంగా ఈ లక్ష్యాలను నిర్దేశించారు.
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, విద్యాసంస్థలతో కలిసి పని చేయనుంది. దేశీయంగా పరిశోధన, అభివృద్ధి (R&D)ని వేగవంతం చేయడం, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలలో సామర్థ్యాన్ని పెంపొందించడం, పరీక్షా సౌకర్యాలను ఏర్పాటు చేయడం ఈ చొరవ ప్రధాన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.
"గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.