భారతదేశం, ఫిబ్రవరి 22 -- తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు, కమల్ హాసన్, రజనీకాంత్.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వెండితెరపై కలిసి కనిపించనున్నారు. శనివారం (ఫిబ్రవరి 21) నాడు 'రెడ్ జెయింట్ మూవీస్' విడుదల చేసిన ఈ అఫీషియల్ ప్రొమో సినీ అభిమానులకు ఐ-ఫీస్ట్‌లా అనిపించింది. కానీ, ఈ ఆనందం మధ్యలో ఒక ఆసక్తికరమైన వివాదం తెరపైకి వచ్చింది. అదే.. ఈ వీడియోలో 'AI' (కృత్రిమ మేధ) వాడకం.

దర్శకుడు నెల్సన్ రూపొందించిన ఈ ప్రొమోలో కమల్ హాసన్, రజనీ కాంత్ ఇద్దరూ షూటింగ్‌కు సిద్ధమవుతూ కనిపిస్తారు. వీరిద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక నెల్సన్ తల పట్టుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు స్టార్స్ తమ డ్రెస్సింగ్ రూమ్‌ల నుంచి బయటకు వచ్చి ఎదురెదురు పడతారు.

గ్యారేజ్ గుండా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కుతుంటే, అక్కడ అనిరుధ్, నెల్సన్ వీరి కోసం వేచి ఉంటారు. రాజీవ్ మీనన్ ...