భారతదేశం, మే 22 -- ఒకే రోజు ఆరు సీరియ‌ల్స్‌కు శుభం కార్డు వేయ‌బోతున్న‌ది ఈటీవీ. మ‌ధ్యాహ్నం స్లాట్ సీరియల్స్‌లో భారీగా మార్పులు చేస్తోంది ఈటీవీ. ఈ మార్పుల్లో భాగంగా ప‌న్నెండు గంట‌ల నుంచి మూడు గంట‌ల టైమ్‌లో ఏడు కొత్త సీరియ‌ల్స్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ది. వీటి కోసం ఆరు పాత సీరియ‌ల్స్‌కు అర్ధాంతంరంగా ప్యాక‌ప్ చెబుతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్‌తోనే ఈ సీరియ‌ల్స్ ముగియ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వ‌సంత కోకిల‌, రాధమ‌నోహ‌రం, కాంతార‌, మౌన పోరాటం సీరియ‌ల్స్‌కు ఈ శ‌నివారం నాడు ఎండింగ్ ప‌డ‌బోతున్న‌ట్లు స‌మాచారం. టీఆర్‌పీ రేటింగ్ త‌క్కువ‌గా ఉండ‌టం, అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోవ‌డంతో ఈ నాలుగు సీరియ‌ల్స్‌కు ముగించేసి వాటి స్థానంలో కొత్త సీరియ‌ల్స్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. ఈ నాలుగు సీరియ‌ల్స్‌తో పాటు ఆడ‌వాళ్లు మీకు జోహార్లు, కావ్య సీ...