భారతదేశం, ఫిబ్రవరి 24 -- టాలీవుడ్ 'రౌడీ' స్టార్ విజయ్ దేవరకొండ, 'నేషనల్ క్రష్' రష్మిక మందన జంట ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనుంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ప్రైవేట్‌గా జరగనుంది.

ఇటీవలే విజయ్, రష్మిక తమ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్‌ను షేర్ చేస్తూ పెళ్లి వార్తను ధృవీకరించారు. అభిమానులు తమను ప్రేమగా పిలుచుకునే 'విరోష్' (Virosh) అనే పేరునే తమ వివాహ బంధానికి నామకరణం చేశారు. "మేం ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు ఎప్పుడూ మా వెంటే ఉన్నారు. అందుకే మా ఈ కలయికను మీ గౌరవార్థం 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని పిలుచుకుంటున్నాం" అని వారు పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ అంటేనే రాజభవనాలకు పెట్టింది పేరు. రష్మిక-విజయ్ తమ పెళ్లి కోసం ఉదయ్‌పూర్ శివార్లలోని ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్, ఏకాయా' (Mementos...