భారతదేశం, మే 13 -- త‌మిళ రొమాంటిక్ కామెడీ మూవీ కా ము కా పి ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సింప్లీ సౌత్ ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఇండియ‌న్ ఆడియెన్స్‌కు మాత్రం ఈ ఓటీటీలో సినిమాను చూడ‌లేరు. ఇదొక ఓవ‌ర్‌సీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే టెంట్ కోట లేదా అమెజాన్ ప్రైమ్‌ల‌లో ఓ ఓటీటీ ద్వారా కా ము కా పి ఇండియ‌న్ ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కా ము కా పి మూవీలో విఘ్నేష్ ర‌వి, త్రిచీ శ్ర‌వ‌ణ్ కుమార్‌, శ‌ర‌ణ్య ర‌విచంద్ర‌న్‌, ప్రియ‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు పుష్ప‌నాథ‌న్ ఆర్ముగం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెరైటీ టైటిల్‌తో త‌మిళ ఆడియెన్స్‌లో ఈ మూవీ ఆస‌క్తిని రేకెత్తించింది. కానీ టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో క‌నిపించ‌క‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

అన్బ...