భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గట్టి దాడికి దిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మురిద్కే, బహవల్ పూర్, పాకిస్థాన్ పంజాబ్ సహా మొత్తం 9 చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

మరోవైపు సరిహద్దులో పాక్ జరిపిన కాల్పుల్లో 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న పూంచ్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో పాకిస్థాన్ జరిపిన దాడిలో ఎనిమిది మంది అమాయకులు మరణించారు. ఈ విధంగా ఉగ్రవాదులపై చర్యకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది.

ఈ విధంగా సరిహద్దు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించగా, పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, ఫాజిల్కా జిల్లాల్లో కూడా పాఠశాలలను మూ...