Telangana,hyderabad, ఆగస్టు 10 -- ఆదివాసీ వర్గాలకు డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ శుభవార్తను చెప్పింది. ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులను పట్టభద్రులను చేయాలన్న లక్ష్యంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఓ ప్రకటన విడుదల చేశారు.
"డా. బీ. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గడిచిన నాలుగు దశాబ్దాల్లో చదువుకు దూరమైన లక్షలాది మందికి ఉన్నత విద్య అవకాశాలు చేరువ చేసింది. కొత్త జీవితావకాశాలు అందించింది. ఈ లక్షలాది మందిలో ఎవరున్నారు అని కాకుండా ఎవరు లేరు అని ఆలోచిస్తే, కొన్నివర్గాలు తెగలు ఇంకా చదువుకు దూరంగా ఉన్నారనేది అర్థమయ్యింది. అందులో ముఖ్యంగా ఆదివాసీ తెగలు ఉన్నత విద్యలో అత్యంత వెనుకబడి ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.