భారతదేశం, జూన్ 7 -- రూ. 2వేల నోట్లను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇక ఇప్పుడు రూ. 500 ఓట్లు కూడా రద్దు అవుతాయని గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కేంద్రం తాజాగా చెక్​ పెట్టింది! 2026 మార్చ్​ నుంచి రూ. 500 నోట్లు చెలామణిలో ఉండవని వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

2026 మార్చ్​ నాటికి రూ. 500 నోట్లు రద్దు అవుతాయని క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్​ ఛానెల్​ నుంచి వీడియో బయటకు వచ్చింది. 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఫలితంగా ప్రజల్లో అయోమయం, భయాందోళనలు నెలకొన్నాయి.

ఇక ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది.

"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు...