భారతదేశం, జనవరి 5 -- అమెరికాలో మరో భారతీయ మహిళ దారుణ హత్యకు గురైంది! కొత్త సంవత్సరం వేడుకల సమయంలో అదృశ్యమైన 27ఏళ్ల నిఖితా గొడిశాల, తన మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లోనే శవమై తేలారు. మేరీల్యాండ్‌లోని కొలంబియాలో జరిగిన ఈ ఘోర ఉదంతం స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిఖిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు విస్తుగొలుపుతున్నాయి. నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) ప్రధాన నిందితుడని హౌవార్డ్ కౌంటీ పోలీసులు అనుమానిస్తున్నారు. జనవరి 2న అర్జున్ శర్మ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి.. డిసెంబర్ 31 నుంచి నిఖిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తనని చివరిసారిగా తన ఇంట్లో కలిశానని, ఆ తర్వాత ఆమె అదృశ్యమైందని చెప్పాడు.

అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే అత...