భారతదేశం, ఫిబ్రవరి 7 -- టీమిండియా అదుర్స్. బ్యాటింగ్ లో టెన్షన్ పెట్టినా కెప్టెన్ సూర్యకుమార్ ఫైటింగ్ తో కోలుకున్న భారత్.. బౌలింగ్ లో సత్తాచాటింది. శనివారం (ఫిబ్రవరి 7) వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో యుఎస్ఏపై భారత్ గెలిచింది. టీ20 ప్రపంచకప్ లో గ్రాండ్ గా బోణీ కొట్టింది.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా విక్టరీలో అతనే హీరో. ఛేజింగ్ లో అమెరికా టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేయగలిగింది. ఇండియన్ బౌలర్లలో సిరాజ్ 3, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో లాస్ట్ మినిట్ లో టీ20 ప్రపంచకప్ లో ఆడే...