భారతదేశం, ఫిబ్రవరి 12 -- Ysrcp Rajyasabha: రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ఆవరణలో నామినేషన్లు వేశారు. అంతకు ముందు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డిలకు బిఫారంలు అందచేశారు.

రాజ్యసభకు ఎంపిక చేసినందుకు అభ్యర్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి శాసన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసిపి సభ్యులు గొల్ల బాబూరావు,వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపి అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద వ...