భారతదేశం, మార్చి 13 -- YSRCP Coteries: వైసీపీని వీడిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి కాకినాడ సీ పోర్ట్‌, సెజ్‌ బదలాయింపు వ్యవహారంలో ఏపీ సీఐడీ ఎదుట బుధవారం హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటల పాటు సీఐడీ సాయిరెడ్డిని ప్రశ్నించింది. సీఐడీ విచారణ ముగిసిన తర్వాత సాయిరెడ్డి దర్యాప్తు తీరును పూసగుచ్చినట్టు వివరించారు. సాయిరెడ్డి సాధారణ వైఖరికి భిన్నంగా తాజా పరిణామాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. నేరుగా వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీపై విమర్శలు గుప్పించారు. సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఢీకొట్టేలా మాట్లాడిన తీరు చర్చనీయాశమైంది.

కాకినాడ సీ పోర్ట్, కాకినాడ సెజ్‌ల బదలాయింపు వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న సాయిరెడ్డి... ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కేవీరావుతో ఎప్పుడు మాట్లాడలేదని అవసరమైతే కాల...