భారతదేశం, మార్చి 25 -- Ys Sharmila: ఏపీలో పెట్రోల్, డీజీల్ ధరల్ని తగ్గించవచ్చంటూ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటల్ని చంద్రబాబు అమలు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఏపీలో పెట్రోల్ ధర రూ. 109.60పైసలు, డీజిల్ ధర రూ 97.47 ఉందని, పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86పైసలు ఉంటే డీజిల్ ధర రూ.92.39పైసలు ఉందని గుర్తు చేశారు.

తమిళనాడుతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద రూ.9 డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90పైసలు, డీజిల్ ధర రూ.88.99పైసలు ఉందన్నారు. కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువ ఉందన్నారు.

ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు, డీజిల్ ధర రూ. 95.70పైసలు ఉందని, తెలంగాణతో పో...