భారతదేశం, జనవరి 29 -- YCP Rebel MLAs: వైసీపీని వీడిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టారు. నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు.

మరోవైపు స్పీకర్ ముందు హాజరయ్యే అంశంపై న్యాయ సలహా తీసుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు చివరకు విచారణకు హాజరవ్వాలని నిర్ణయించారు. ఆరోగ్యం సరిగా లేదంటూ ఇప్పటికే స్పీకర్‍‌కు రాసిన మేకపాటితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు విచారణకు హాజరయ్యారు.

కొద్దిరోజుల క్రితం విశాఖస్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం అమోదించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెబల్ ...