భారతదేశం, మార్చి 18 -- ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి మండ‌లంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు, ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉండి మండ‌లంలోని ఒక గ్రామంలో త‌మ కుటుంబ జీవిస్తోంది. త‌మ ప్రాంతానికే చెందిన య‌ర్రంశెట్టి ర‌వి, సోమేశ్వ‌ర‌రావు ఆ వివాహిత ప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హించారు. ఆమెను బ‌ల‌వంతంగా లోబ‌ర్చుకుని, త‌మ‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే భ‌ర్త‌ను, కుటుంబాన్ని చంపేస్తామ‌ని బెదిరించారు. వారి చెర నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆమె ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. కొడుతూ ఆమెకు బ‌ల‌వంతంగా మ‌త్తు మందు తాగించి.. అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

ఆమె మ‌త్తులోకి జారుకున్న‌త‌రువాత న‌గ్నంగా వీడియోలు తీసుకొని, అక్క‌డే వ‌దిలేసి వెళ్లి పోయారు. ఆ త‌రువాత వీడియోల‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్‌కు పాల...