Hyderabad, మార్చి 20 -- భోజనం చేస్తూ మధ్య మధ్యలో నీళ్లు తాగేవారు ఎంతో మంది. కానీ అలా భోజనం తింటూ నీళ్ళు త్రాగకూడదని, భోజనం చేసిన వెంటనే కూడా కూడా నీళ్ళు త్రాగకూడదని చెబుతారు. అలా చేస్తే జీర్ణక్రియ నెమ్మదిస్తుందని అంటారు. అయితే అది పూనిజమా? కాదా? అనే విషయాన్ని తెలుసుకుందాం.

భోజనంతో పాటు నీళ్ళు త్రాగడం గురించి చాలా మంది ఆయుర్వేద నిపుణులు సరైన సమాచారాన్ని అందించారు. ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటు నీళ్ళు త్రాగవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనంతో పాటు నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

మీరు మన శరీరానికి ఎంతో ముఖ్యం. శరీరంలోని కణాలకు పోషకాలు అందించే బాధ్యత నీటిదే. ఆక్సిజన్‌ను శరీరం అంతా మోసుకెళ్లి, టాక్సిన్స్ ను బయటికి పంపిస్తుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే భోజనం చేసేటప్పుడు ఆయుర్వేదం ప్రకారం మ...