భారతదేశం, మార్చి 11 -- కేరళలో షాకింగ్​, హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది! దాదాపు 6 నెలల పాటు మంచి నీరే ఆహారంగా తీసుకుని బతికిన ఒక 18ఏళ్ల యువతి, చివరికి ప్రాణాలు కోల్పోయింది. మరణం సమయంలో ఆమె బరువు కేవలం 24కేజీలు! అసలేం జరిగిందంటే..

కేరళలోని థలస్సెరిలో జరిగింది ఈ ఘటన. యువతి పేరు శ్రీనంద. బరువు పెరుగుతానన్న భయం ఆమెకు ఎప్పుడూ ఉండేది. ఫలితంగా ఆన్​లైన్​లో వెయిట్​లాస్​ టిప్స్​ వెతికేది. చివరికి వేడి నీటి డైట్​ గురించి తెలుసుకుంది. అప్పటి నుంచి కేవలం నీరు తాగుతూ జీవిస్తోంది.

ఈ వాటర్​ డైట్​ కారణంగా శ్రీ నంద గత 5,6 నెలలుగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. కుటుంబసభ్యులు ఆమెను 6 నెలల క్రితం వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆమెకు సరైన భోజనం పెట్టాలని సూచించారు. అంతేకాదు, ఆమెను సైకియాట్రిస్ట్​ దగ్గరికి తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు.

ఈ తరహా కండీషన్​న...