భారతదేశం, ఏప్రిల్ 4 -- వరంగల్ జిల్లా వర్దన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలిని.. దుండగుడు మోసం చేశాడు. రూ.3 లక్షల నగదు దోచుకెళ్లాడు. ఆ దొంగను పట్టించిన వారికి పోలీసులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దొంగను పట్టిస్తే రూ.10 వేల నగదు బహుమతిగా ఇస్తామంటూ.. వర్ధన్నపేట పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు ఖాకీలతో పాటు మరివైపు కొందరు జనాలు కూడా సీసీ ఫుటేజీల నుంచి సేకరించిన నిందితుడి ఫొటోతో చుట్టుపక్కల గాలిస్తున్నారు.

వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన నందనం భారతమ్మ 60 ఏళ్ల వృద్ధురాలు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పని చేసేది. కొంతకాలం కిందట రిటైర్ అయ్యింది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న వృద్ధురాలు.. తాను పని చేస్తున్న కాలం నుంచి వర్ధన్నపేటలోని ఓ బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంది. అలా దాదాపు రూ.లక్ష వరకు దాచుకోగా.. సుమారు మూడు రోజుల కిందట అదనం...