భారతదేశం, మార్చి 14 -- Warangal Crime: వరంగల్‌లో సుపారీ హత్యకు వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది. ఇటీవల వరంగల్ నగరంలో ఇదే తరహాలో ఓ యువ డాక్టర్ ను తన భార్యే చంపించగా.. ఇప్పుడు ఈ సుపారీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధరావత్ సుమన్ హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయనకు నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018లోనే వివాహం జరిగింది. కొద్దిరోజుల పాటు వారి సంసార జీవితం సాఫీగానే సాగగా.. ఒక పాప కూడా పుట్టింది.

ఇదిలా ఉంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా.. వాళ్లిద్దరు ఒక్కటి కాలేకపోయారు.

తరచూ గొడవ...