భారతదేశం, ఏప్రిల్ 2 -- Waqf Board Bill : వక్ఫ్ సవరణ బిల్లు- 2025 పై పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తరపున బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. దేశంలో పట్టణాలలో నివసించే ముస్లింలలో 31 శాతం మంది దారిద్యరేఖకు దిగువన ఉన్నారని, వారి అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ధార్మిక దేవదాయ చట్టానికి స్వయం ప్రతిపత్తి కల్పించినట్లుగానే, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించే అధికారాన్ని రాష్ట్రాలకే వదలాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

"వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ ముస్లింల సంక్షేమం, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని అడుగడుగునా కృషిచేసింది. అదే సమయంలో వైసీపీ అసలేమాత్రం ఈ విషయంలో శ్రద్ధ చూపించలేదు. జేపీసీ 38 సార్లు సమావేశమైతే టీడీపీ 90 శాతం సమావేశాలకు హాజరైంది. వైసీపీ మొక్కుబడిగా క...