New Delhi, ఏప్రిల్ 2 -- వక్ఫ్ సవరణ బిల్లు-2024 బుధవారం లోక్‌సభలో చర్చకు, ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కేంద్రం, ప్రతిపక్షాల మధ్య భారీ వాగ్యుద్ధానికి రంగం సిద్ధమైంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నేతలతో కూడిన లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఎనిమిది గంటల చర్చకు అంగీకరించిందని మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులకు తెలిపారు. కాగా వక్ఫ్ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి కీలకమైన మిత్రపక్షాలైన జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), తెలుగుదేశం పార్టీ (టిడిపి) మద్దతుపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) విశ్వాసంతో ఉందని సీనియర్ నాయకులు మంగళవారం చెప్పారు.

మరోవైపు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించేందుకు ఉమ్మడి వ్యూ...