Vontimitta,andhrapradesh, ఏప్రిల్ 11 -- ఒంటిమిట్టలో ఇవాళ సాయంత్రం శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య రాములోరి కల్యాణ వేడుక ఉండనుంది.
శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు.భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.