భారతదేశం, ఏప్రిల్ 14 -- Vontimitta Accident : కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు త గాయపడ్డారు. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి వైపు నుంచి అతి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం, ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులది నంద్యాల జిల్లా కేంద్రం హౌసింగ్‌ బోర్డు కాలనీగా పోలీసులు గుర్తించారు.

పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డితోపాటు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయింది. మితివీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. రాజంపేట, ఒంటిమిట్టకు ...