భారతదేశం, మార్చి 18 -- VMC Works: విజయవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా సాగింది. 2021-26 మధ్య ఐదేళ్ల కాలానికి 15వ ఆర్థిక సంఘం విజయవాడ రూ.124కోట్ల రుపాయల నిధుల్ని మంజూరు చేసింది. నగరంలో మౌలిక సదుపాయాలు, తాగునీటి సదుపాయాలను మెరుగు పరచడానికి వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత పనుల కోసం మాత్రమే 15వ ఆర్థిక సంఘం నిధుల్ని వెచ్చించాల్సి ఉండటంతో కార్పొరేషన్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు అతి తెలివి ప్రదర్శించారు.

విజయవాడ నగరం మొత్తానికి చాలా కాలం క్రితమే రక్షిత మంచినీటి సరఫరా పైప్‌లైన్ల నిర్మాణం జరిగింది. కృష్ణా నదిలో ఉన్న హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి నగరంలోని మెజార్టీ ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు సరఫరా జరుగుతుంది. కొండ ప్రాంతాల్ల...