భారతదేశం, ఏప్రిల్ 1 -- Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైనా, తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధానంగా చర్చించారు.

సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ... రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్)తో ప్లాంట్‌కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు, 3వ ఫర్నేస్‌ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతి...