భారతదేశం, మార్చి 13 -- Vizag Metro: ఆంధ‌రప్రదేశ్‌లోని విశాఖలో నిర్మించే మెట్రో కారిడార్‌లలో స్టీల్ ప్లాంట్ నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కు మెట్రో రైల్ ప్ర‌తిపాద‌న లేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొణతాల రామ‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి నారాయ‌ణ స‌మాధానం ఇచ్చారు.

విశాఖ‌లో మెట్రో రైల్ కారిడార్‌ల‌పై 2051నాటికి ట్రాఫిక్ ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ రూపొందించినట్టు వివరించారు. పీక్ అవ‌ర్ పాసింజ‌ర్ డైవ‌ర్ష‌న్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైల్ పై కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటుందని, క‌నీసం పాసింజ‌ర్ డైవ‌ర్ష‌న్ ప‌దివేలు ఉంటేనే మెట్రో రైల్ కు అనుమ‌తి వ‌స్తుందని చెప్పారు.

స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మెట్రో పీక్ అవ‌ర్ ట్రాఫిక్ 10వేల‌కు పైగా ఉండ‌టంతో ఆయా కారిడార్ల‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చిందని, స్టీల్ ప్లాంట్ నుంచ...