భారతదేశం, మార్చి 15 -- వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా.. న్యాయం జరగడం లేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారని.. ఈ కేసులో నిందితులకన్నా తామే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని వాపోయారు. ఇన్వెస్టిగేషన్, ట్రయల్లో లోపాలు జరిగాయని సునీత ఆరోపించారు.
'వివేకానంద రెడ్డి హత్యకు గురై ఆరేళ్లయింది. ఈ కేసులో ఇంకా మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా బయట తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నాం. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని కొందరు బెదిరిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.