ఆంధ్రప్రదేశ్,విశాఖపట్నం, ఫిబ్రవరి 8 -- వాల్తేరు రైల్వే డివిజన్ ను కుదించి విశాఖపట్నం డివిజన్ గా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కొనసాగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ఈ నిర్ణయంతో వాల్తేర్‌ డివిజ­న్‌లో భాగమైన పలాస-విశాఖపట్నం- దువ్వాడ, కూనేరు - విజయ­నగరం, నౌపాడ జంక్షన్‌ - పర్లాకి­మిడి, బొబ్బిలి జంక్షన్‌- సాలూరు, సింహాచలం నార్త్‌ -­దువ్వాడ బైపాస్, వడ్లపూడి - దువ్వాడ, విశాఖ­ స్టీల్‌ ప్లాంట్‌ - జగ్గయ­పాలెం (సుమారు 410 కి.మీ) విభాగాలు ఇకపై సౌత్‌ కోస్ట్‌ రైల్వే కిందికి రానున్నాయి. విశాఖపట్నం డివిజన్‌లో కొనసాగుతాయని ప్రకటించింది.

ఇప్పటి­వరకు వాల్తేర్‌ డివిజన్‌లో భాగమైన కొత్తవలస - బచేలి, కూనేరు - తేరువలి జంక్షన్, సింగాపుర్‌ రోడ్‌- కోరాపుట్, పర...