భారతదేశం, ఏప్రిల్ 13 -- Visakha International Services : ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ‌ప‌ట్నం నుంచి కొన్ని అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు నిలిపివేశారు. మ‌రికొన్ని అంత‌ర్జాతీయ విమ‌న స‌ర్వీసులు ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఈ ప‌రిణామం విశాఖ‌ప‌ట్నం అభివృద్ధిపై ఇది తీవ్ర ప్రభావం ప‌డ‌నుంద‌ని విశాఖ వాసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాష్ట్రానికి, అందులోనూ ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలాంటి ప‌రిణామం చోటుచేసుకోవ‌డం ప‌ట్ల ఆ ప్రాంత వాసులు విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదికంగా విశాఖ‌ప‌ట్నం అభివృద్ధిపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. శ్రీ‌కాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న బాధ్యత‌లు చేపట్టిన త‌రువాత ఆంధ్రప్రదేశ్‌లో విమాన‌యాన క‌నె...