భారతదేశం, ఫిబ్రవరి 24 -- టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటి కావడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఉదయ్‌పూర్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అతిథులు ఉదయ్‌పూర్ చేరుకోవడం ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. ఈ ఇద్దరూ రిలేషన్షిప్‌లో ఉన్నారన్న పుకార్ల నేపథ్యంలో కలిసే పెళ్లికి వెళ్లడం విశేషం.

మరో రెండు రోజుల్లోనే విజయ్, రష్మిక పెళ్లితో ఒక్కటవనున్నారు. అభిమానులు ఎంతో ప్రేమగా 'విరోష్' (VIROSH) అని పిలుచుకునే ఈ జంట రాయల్ వెడ్డింగ్ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్'లో (Mementos by ITC Hotels) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కోసం అటు ఇరు కుటుంబాలతో పాటు ఇటు అభిమానులు క...