భారతదేశం, ఫిబ్రవరి 10 -- భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇంగ్లండ్-భారత్ వన్డే సిరీస్ కోసం కామెంటేటరీ విధుల్లో ఉన్న పీటర్సన్ ను కోహ్లి తరచూ కలుస్తున్నాడు. తాజాగా రెండో వన్డే సందర్భంగా బౌండరీ లైన్ బయట వీళ్లు మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తొలి వన్డేకు ముందు కూడా వీళ్లు కలిసి మాట్లాడుకున్నారు.

లండన్ లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్న కోహ్లి అక్కడి రియల్ ఎస్టేట్ గురించి ఆరా తీస్తున్నాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయాల గురించి తరచుగా పీటర్సన్ తో కోహ్లి డిస్కషన్ పెడుతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే కోహ్లీకి లండన్ లో ఓ ఇల్లు ఉంది. ఇంకా ఇతర ప్రాపర్టీల కోసం అతను పీటర్సన్ తో మాట్లాడుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి.

క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత లండన్ లోనే సెటిల్ అ...