భారతదేశం, మార్చి 24 -- అమరావతికి గేట్ వేగా ఉన్న విజయవాడను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన విజయవాడకు.. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కృష్ణా తీరంలోని బెజవాడ నగరాన్ని వివిధ రంగాల సమగ్ర అభివృద్ధితోనూ పరుగులు తీయించాలని.. ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలను భాగస్వాముల్ని చేసేందుకు.. ఎన్టీఆర్ జిల్లా అధికారులు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.విజయవాడకు పుదుచ్చేరి తరహాలో బ్రాండింగ్ తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 'వైబ్రెంట్ విజయవాడ' పేరుతో ఒక లోగోను రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.

2.ప్రభుత్వ శాఖలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్ అసోసియేష...