భారతదేశం, మార్చి 21 -- Vijayawada Mla: ఏపీ అసెంబ్లీలో విజయవాడకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్‌‌తో దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం రెవిన్యూ శాఖకు సీనియర్ ఐఏఎస్‌ అధికారిణితో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఐఏఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయవాడ నగరానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు కొన్ని రోజులు ప్రభుత్వ స్థలం క్రమబద్దీకరణ దరఖాస్తుల్ని రెవిన్యూ శాఖకు సిఫార్సు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ భూమిని కమబద్దీకరించడానికి కుదరదని అధికారులు దరఖాస్తుదారులకు స్పష్టం చేశారు.

విజయవాడ నగరంలోని కాల్వగట్లు, నిషిద్ధ స్థలాలను ఆక్రమించిన వారు ఇప్పటికే ఆ స్థలాల్లో భారీ భవనాలు నిర్మించడంతో ఎలాగైనా వాటిని క్రమబద్దీకరించాలని కొన్నేళ్లుగా ప్రయత్...