భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ.. మాఘ శుద్ధ పంచమి సందర్బంగా సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడో తేదీ ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించి.. పెన్నులు అందజేస్తారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు స్కూల్, కాలేజీ యూనిఫాం ధరించి, ఐడీ కార్డు తీసుకురావాలని ఆలయ అధికారులు సూచించారు. పెన్నుతో పాటు అమ్మవారి రక్ష కంకణం, పాకెట్ సైజు ఫొటో, ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సుమారు 40 వేల మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు..
సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని.. మూలవిరాట్ తోపాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని.. విశేషంగా అలంకరిస్తారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.