భారతదేశం, జనవరి 25 -- రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం రాత్రి విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిళ్లూ లేవని ట్వీట్ చేశారు.

'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీస...