కరీంనగర్,వేములవాడ, ఏప్రిల్ 21 -- Vemulawada Crime News : ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ(Vemulawada)లో గంజాయి కలకలం సృష్టిస్తుంది. గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చత్తీస్ గడ్ నుంచి వేములవాడకు అక్రమంగా గంజాయి తరలించే ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో అరెస్టు అయిన ముఠా వివరాలు వెల్లడించారు. వేములవాడ కు చెందిన వికాస్ కుమార్, అనుపమ్ దాస్, నరేందర్ ఛత్తీస్గఢ్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. యువత గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సమూలంగా గంజాయిని నిర్మూలించేందుకు యుద్దం ప్రకటించాలని కోరారు.

గంజాయి విక్రయించిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని ఎస...