భారతదేశం, మార్చి 17 -- US Accident: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. అత్తా కోడళ్లతో పాటు ఆరేళ్ల చిన్నారి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం అందరిని కలిచి వేసింది.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35) వియ్యపురాలు సునీత రెడ్డి (56)తో పాటు మనుమడు ఆరేళ్ల హర్వీన్‌ రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్లోరిడాలో ఈ ప్రమాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన రోహిత్‌ రెడ్డితో.. ప్రణీతరెడ్డికి వివాహం జరిగింది. ఈ దంపతులకుే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కుమార్తెను చూసేందుకు అత్త సునీత అమెరికా వెళ్లారు. అత్త సునీతతో కలిసి ప్రణీత...