భారతదేశం, మార్చి 29 -- ప్రయాణికుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది ఫెస్టివ‌ల్ స్పెష‌ల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ నుంచి మ‌రో 14 ప్రత్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ర‌ద్దీ క్లియ‌ర్ చేసేందుకు ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే తెలిపింది.

1.గుంటూరులో బ‌య‌లుదేరే గుంటూరు- ఎస్ఎస్ఎస్‌ హుబ్బళ్లి స్పెష‌ల్ రైలును (07271) మార్చి 31న అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైలు మార్చి 31 (సోమ‌వారం) రాత్రి 8 గంట‌ల‌కు గుంటూరు నుంచి బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 9.20 గంట‌ల‌కు హుబ్బ‌ళ్లి చేరుకుంటుంది.

2. ఎస్ఎస్ఎస్ హుబ్బ‌ళ్లి బ‌య‌లుదేరే ఎస్ఎస్ఎస్ హుబ్బ‌ళ్లి-గుంటూరు స్పెష‌ల్ రైలు (07272) ఏప్రిల్ 1న అందుబాటులోకి రానుంది. ఈ రైలు ఏప్రిల్ 1 (మంగ‌ళ‌వారం) ఉద‌యం 11 గంట‌ల‌కు హుబ్బ...