భారతదేశం, ఏప్రిల్ 23 -- TS SSC Results Update: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. 30వ తేదీ ఉదయం 11గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్టు సెకండరీ బోర్డు ప్రకటించింది. విద్యా శాఖ కమిషనర్‌ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేయ నున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి.

ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (TS SSC Spot Valuation 2024) ఇప్పటికే పూర్తైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యూ...