భారతదేశం, మార్చి 27 -- TS New High Court: తెలంగాణలో నూతన హైకోర్టు High court భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ Chandra Chud నేడు శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ Rajendra Nagar మండలం బుద్వేల్‌లో కొత్త భవనాలను నిర్మించనున్నారు.

శంకుస్థాపన కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదేతో సమా వేశం సందర్భంలో కొత్త భవన నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు సిఎం రేవంత్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో భూమి కేటాయింపు కోరుతూ న్యాయశాఖ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రా...