తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 27 -- Telangana Graduate MLC By Election 2024 : తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గానికి ( నల్గొండ - ఖమ్మం - వరంగల్ ) జరగనున్న ఎన్నిక ఈ సారి ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS)కి కఠిన పరీక్ష పెట్టనున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించిన ఆ పార్టీకి ఈ సారి ఎన్నిక సవాలు విసురుతోంది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. కానీ, తెలంగాణ శాసన సభకు 2023 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నిక కావడతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నిక అనివార్యమైంది. 2014 ముందు నుంచీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరసగా నాలుగు పర్యాయాలుగా గెలుస్తూ...