భారతదేశం, ఫిబ్రవరి 11 -- Tribal Acts: పర్యాటక ప్రాజెక్టుల కోసం గిరిజన చట్టాల్లో సవరణలు చేయాలంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏజెన్సీలో బంద్‌ జరుగుతుండటంతో చట్టాలను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి...