Hyderabad,telangana, ఏప్రిల్ 11 -- ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వివరాలను పేర్కొంది. ఏప్రిల్/మే సెషన్ కు సంబంధించిన పరీక్షలు. ఏప్రిల్ 20వ తేదీతో ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 26వ తేదీతో ఈ ఎగ్జామ్స్ ముగుస్తాయి.

థియరీ పరీక్షలు రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఇక ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26వ తేదీన ప్రారంభమవుతాయి. మే 3వ తేదీతో అన్ని పరీక్షలు ముగుస్తాయి. కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పరీక్షల షెడ్యూల్ వివరాలు ఉన్నాయి..

Published by HT Digital Content Services with permission from HT Telugu....