భారతదేశం, ఏప్రిల్ 16 -- Tollywood: తెలుగు కామెడీ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. భామ‌క‌లాపం త‌ర్వాత నిర్మాత‌లు బీ బాపినీడు, సుధీర్ ఈద‌ర క‌లిసి వీరాంజ‌నేయులు విహార‌యాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

వీరాంజ‌నేయులు విహార‌యాత్ర సినిమాలో సీనియ‌ర్ న‌రేష్ తో పాటు బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. కీడాకోలా ఫేమ్ రాగ్‌మ‌యూర్‌, ప్రియావ‌డ్ల‌మాని హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్నఈ సినిమా డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది.

ఇటీవ‌ల ఈసినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ పాత‌కాలం నాటి వ్యాన్‌లో గోవాకు ఓ ఫ్యామిలీ మొత్తం గోవా టూర్ వెళుతున్న‌ట్లుగా చూపించారు. వ్యాన్...