భారతదేశం, ఏప్రిల్ 9 -- Tirupati Pakala Katpadi Project : ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1332 కోట్లుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని, లాజిస్టిక్ ఖర్చును తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతో చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు, తక్కువ CO2 ఉద్గారాలకు దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ సుమారు 400 గ్రామాలకు, సుమారు 14 లక్షల జనాభాకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవాళ దిల్లీలో కేంద్ర కేబినెట్ భేట...