భారతదేశం, మార్చి 21 -- Tirupati Lands: తిరుపతిలో ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్‌కు కేటాయించిన 35 ఎకరాలు రద్దు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి భూ కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు.దేశంలోని ప్రతి రాష్ట్రంలోని రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. దీని కోసం .అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తామన్నారు.

తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్‌కు అనుమతులు ఇచ్చి.. 35.32 ఎకరాలు కేటాయించారన్న సీఎం చంద్రబాబు ఈ కేటాయింపులను రద్దు చేస్తున్నామన్నారు. ఏడు కొండలను ఆనుకుని ఎవరూ వ్యాపారం చేయడం, అపవిత్రం చేయడానికి వీళ్లేదన్నారు.

వేంకటేశ్వరస్వామి పవిత్రను కాపాడటానికి ఒకడుగు ముందుక...