భారతదేశం, జూన్ 2 -- Tirupathi Accident: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వందల ఏళ్ల నాటి రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోవడంతో కడపకు చెందిన విశ్రాంత వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు.

గోవిదంరాజ స్వామి ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న భారీ వృక్షం.. గాలివానకు మొదలు నుంచి రెండు ముక్కలుగా చీలిపోయి అక్కడే ఉన్న భక్తులపై పడింది. ఈ ఘటనలో కడపకు చెందిన రిమ్స్‌ విశ్రాంత వైద్యుడు డా.రాయదుర్గం గుర్రప్ప తలకు గాయమై అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

గుర్రప్ప కుమార్తె శ్రీ రవళి తిరుపతి నగరంలోని ఓ కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తుంటడంతో ఆమెను చూడటానికి తిరుపతి వచ్చారు. అనంతరం కుమార్తెతో కలిసి దర్శనానికి రాగా చెట్టు కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

తండ్రి మృతదేహం వద్ద కుమార్తె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది....