ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఫిబ్రవరి 9 -- ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఉండే వీఐపీ బ్రేక్ దర్శన కోటాపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోటాను రెట్టింపు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) సభ్యులకు ప్రస్తుతం రోజువారీగా వీఐపీ బ్రేక్ దర్శన కోటా కింద 50 టికెట్లను ఇస్తున్నారు. అయితే ఈ కోటాను 100 పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
టీటీడీ నిర్ణయం ఫలితంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే పలువురు ప్రవాస భారతీయులకు దర్శనం విషయంలో మరికొంత వెసులుబాటు కలగనుంది. ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఈ కోటాను టీటీడీ పెంచింది. ఈ కోటా కింద ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుల్లోనూ వృద్ధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Published by HT Digital Content Services with perm...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.